Friday, January 17, 2014

23/01/2014 దాక క్షణం క్షణం టెన్షన్ టెన్షన్

                   రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే చరిత్రాత్మికమైన  అసెంబ్లి సమావేశములు  ఈ రోజు ప్రారంభమైనాయి. క్రికెట్టు ఆటలో చివరి బంతి పూర్తయ్యే వరకు జయాపజయములు తెలియవని ఇంకా చివరి బంతి మిగిలేవుందని ఓ నాయకుడు సెలవిచ్చరు.  కానీ చివరి బంతి వేసెదెవరొ,  బ్యాటింగ్ చెసేదెవరొ కానీ  రాష్ట్ర పరిస్తితులు నిశితముగా పరిశీలిస్తున్న వారికి మాత్రము  అనుక్షణం టెన్షనో టెన్షనుగా వుంది.  ఒక ప్రాంతము వారేమో కలిసేవుంటామంటారు   మరొక ప్రాంతము వారేమో తప్పక విడిపోతామంటారు.  రాజకీయ నాయకులంతా వారి వారి పార్టీలను ప్రక్కన పెట్టి  ప్రాంతాల వారిగా విడిపోయి వారి వారి ప్రాంతాలకు అనుకూలముగా మాట్లాడుతున్నారు.  కొన్ని ప్రాంతాలలో సమైక్య  రాష్ట్రం కోసం కొత్త రాజకీయ పార్టి  ఆవిర్భావిస్తున్నటు హోర్డింగులు వెలిశాయి.   చివరి బంతికి సిక్స్ కొడతారా లేక అవుట్ అవుతారో ?

                  రాష్ట్రములోని  సామాన్యుల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తుపై ఆధారపడి వున్నది.  కావున శాసన సభలోని పెద్దలందరూ  సఘటు మనిషిని దృష్టిలో ఉంచుకొని  రాష్ట్రములోని అన్ని ప్రాంతముల వారికి మంచి జరిగేల నిర్ణయము తీసుకొనవలెను.